* గవర్నర్ ప్రత్యేక అనుమతితో అందజేసిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్
ఈనాడు, హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని ప్రతిష్ఠాత్మక పశువైద్య పరిశోధన సంస్థ ఐవీఆర్ఐలో పీజీ ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థులకు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జ్ఞానప్రకాశ్ ఫిబ్రవరి 7న ప్రొవిజినల్ డిగ్రీ ధ్రువపత్రాలను అందజేశారు. ‘పశువైద్య విశ్వవిద్యాలయంలో స్తంభించిన పాలన’ శీర్షికన ఫిబ్రవరి 6న ప్రచురితమైన కథనానికి స్పందించి గవర్నర్ తమిళిసై ఇచ్చిన ప్రత్యేక అనుమతి మేరకు డిగ్రీ ధ్రువపత్రాలను సిద్ధంచేసి అందించారు. వర్సిటీకి చెందిన 15 మందికి పైగా విద్యార్థులు ఐవీఆర్ఐ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు సాధించారు. పీజీలో చేరడానికి శుక్రవారం తుదిగడువు కాగా ప్రొవిజినల్ డిగ్రీ ధ్రువపత్రాలు అందక వారంతా ఆందోళన చెందారు. ఈ విషయమై ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావడంతో గవర్నర్ స్పందించి వెంటనే ఆ విద్యార్థులకు ధ్రువపత్రాలను అందించాలని ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రార్.. వీసీ తరఫున వాటిపై సంతకం చేసి విద్యార్థులకు అందజేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.