* ప్రకటనల పూర్తి వివరాలు ఇవే..
* డిగ్రీ, పీజీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం
ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల సాధనకు ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త. తాజాగా మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా పీఎన్బీ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటనను జారీ చేసింది. అలాగే 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా; 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలకు ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. డిగ్రీ, పీజీ, సీఏ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. పీఎన్బీ పోస్టులకు ఫిబ్రవరి 25; యూబీఏ ఖాళీలకు ఫిబ్రవరి¨ 23; ఐడీబీఐ ఉద్యోగాలకు ఫిబ్రవరి¨ 26వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* ఐడీబీఐ బ్యాంకులో 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
* యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
* పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.