• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 10-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  సంక్షేమం గ్యారంటీ
రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తామని చెబుతున్న కొత్త ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే సంక్షేమ రంగానికి ఓటాన్‌ ఎకౌంట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు, సంక్షేమ పథకాలకు అత్యధిక నిధులు కేటాయించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

2.   గుర్తుకొస్తున్నాయి
పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి లోక్‌సభ మారడం 17వ లోక్‌సభ కీలక ఘటనల్లో ఒకటని, తనలాంటి సీనియర్‌ సభ్యులు కొత్త భవనంలోని పరిస్థితులకు అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  కేరళ చిత్రకారుడు ఎ.రామచంద్రన్‌ మరణం
ప్రఖ్యాత చిత్రకారుడు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ఎ.రామచంద్రన్‌ (89) సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దిల్లీలోని తన నివాసంలో మరణించారు. కేరళలో జన్మించిన రామచంద్రన్‌ రంగుల చిత్రకళతో అద్భుతాలు సృష్టించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  కార్ల్‌సన్‌పై గుకేశ్‌ విజయం 
భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌.. ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)కు షాకిచ్చాడు. వీసెన్‌హాస్‌ చెస్‌ ఛాలెంజర్‌ ఫ్రీస్టైల్‌ టోర్నీ రెండో రౌండ్లో కార్ల్‌సన్‌పై గుకేశ్‌ పైచేయి సాధించాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  రఫాపై ఆగని వైమానిక దాడులు 
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం భీకర దాడులు నిర్వహించింది. ఇందులో 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. వీరిలో మూడు నెలల పసికందు సహా 12 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.