ఈనాడు-అమరావతి: ఫిబ్రవరి 25న నిర్వహించే గ్రూపు-2 ప్రిలిమ్స్ను మరో 40 రోజులు వాయిదా వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఏపీపీఎస్సీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న ఓ వినతిపత్రాన్ని అందజేసింది. ‘2016, 2018లో నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు.. ప్రిలిమ్స్ రాసేందుకు వంద రోజులకుపైగా సమయం ఇచ్చారు. తాజా నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ రాసేందుకు 69 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో సన్నద్ధత పరంగా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రూపు-2 సిలబస్లోనూ మార్పులు చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రిలిమ్స్ను వాయిదా వేయాలి’ అని కోరినట్లు డీవైఎఫ్ఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
సమన్యాయం చేయాలి: అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ధారించినప్పుడు.. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులకు వయోపరిమితి 42 ఏళ్లకు పరిమితం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 24 జిల్లాల్లో గ్రూపు-2 ప్రిలిమ్స్: గ్రూపు-2 (నోటిఫికేషన్ 11/2023) ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25న.. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫిబ్రవరి 14 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి ఫిబ్రవరి12న ఓ ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.