* వచ్చే 5-7 ఏళ్లలో రావొచ్చు: హెచ్ఏఐ
దిల్లీ: వచ్చే 5-7 ఏళ్లలో ఆతిథ్య, పర్యాటక రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) తెలిపింది. ఉద్యోగాల కల్పనకు ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌలిక రంగ హోదాను రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని కోరింది. ఆతిథ్య రంగానికి మౌలిక రంగ హోదా ఇవ్వడం ద్వారా పెట్టుబడులతో పాటు ఆదాయం, ఉద్యోగాల సృష్టి సాధ్యపడుతుందని హెచ్ఏఐ అధ్యక్షుడు పునీత్ ఛాట్వాల్ పేర్కొన్నారు. 6వ హెచ్ఏఐ హోటలియర్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పునీత్ ఇండియన్ హోటల్స్ కంపెనీ ఎండీ, సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. దేశ అభివృద్ధిలో పర్యాటక రంగమూ కీలకమేనని, మొత్తం ఉపాధిలో 10 శాతం, జీడీపీలో 8 శాతం వాటాను ఈ రంగం అందిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో మంచి వృద్ధికి అవకాశం ఉందని, అయితే వాస్తవ విధానాలకు.. వాటి కార్యాచరణ మధ్య అంతరం ఉంటోందని, దీనిని సరిదిద్దాల్సి ఉందన్నారు. గత రెండేళ్లలో ఈ రంగ నియామకాల్లో 271% వృద్ధి నమోదైందని హెచ్ఏఐ ఉపాధ్యక్షుడు కేబీ కచ్రు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
* ఫుల్క్రమ్ 700 నియామకాలు
దిల్లీ: డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్ఫామ్ కంపెనీ ఫుల్క్రమ్ డిజిటల్, ఈ ఏడాది 700 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైంటిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి టెక్నాలజీ డొమైన్లలో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ ఛైర్మన్ రాజేశ్ సిన్హా తెలిపారు. పెద్ద డేటాబేస్లను నిర్వహించే సంస్థల కార్యకలాపాలను సులభతరం చేసేందుకు జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ ‘రైజ్’ను కంపెనీ విడుదల చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.