1. శంషాబాద్లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ పరిశ్రమ
దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ (అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్) సంస్థ శంషాబాద్ సమీపంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ను నెలకొల్పనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ మరణం
ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, న్యాయరంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్ నారీమన్ (95), భారతీయ న్యాయ వ్యవస్థలోని ‘కేశవానంద భారతి’లాంటి ఎన్నో కీలక కేసుల్లో పాలు పంచుకున్న ఆయన దిల్లీలో మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం
మిత్రదేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ విధానంలో ప్రధానమైనవి రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ‘మిలాన్-2024’ కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకారం
సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని భారత్-గ్రీస్ దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల రాకపోకలు రెండు దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అమెరికా ఉపాధ్యక్ష పదవికి వివేక్ రామస్వామి!
అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్షుడిగా ఎంపిక కాగల అభ్యర్థుల జాబితాను తయారుచేస్తున్నారు. వారిలో భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా ఉండటం విశేషం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. చైనాతో చర్చలు సైన్యంలో కీలక మార్పులు
సరిహద్దుల విషయంలో భారత్ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖవద్ద లద్దాఖ్ సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.