కేయూ క్యాంపస్, న్యూస్టుడే: కాకతీయ విశ్వ విద్యాలయ పరిధి దూరవిద్య కేంద్రం ద్వారా అందిస్తున్న వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా కేయూ ఉప కులపతి ఆచార్య టి.రమేశ్, కేయూ ఉన్నతాధికారులతో కలిసి షెడ్యూల్ గోడపత్రికలు ఆవిష్కరించారు. కేయూ దూరవిద్య కేంద్రం సంచాలకులు ఆచార్య వి.రామచంద్రం ప్రవేశాలకు సంబధించిన వివరాలను వెల్లడించారు. డిగ్రీ, పీజీ, డిప్లామా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. మొత్తం 43 కోర్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. మార్చి 26వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.