• facebook
  • whatsapp
  • telegram

ఏపీఈఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

* మే 13 నుంచి 16 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు

కాకినాడ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను  మార్చి 11న విడుదల చేసినట్లు సెట్‌ ఛైర్మన్‌, ఉప కులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ డీఏపీ కె.వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 13 నుంచి 16 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు, మే 17 నుంచి 19 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు.  మార్చి 12న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తెలంగాణలో సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు https://cets.apsche.ap.gov.in, 0884-2359599, 2342499 నంబర్లలో సంప్రదించవచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.