తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: ఏపీ ఆర్సెట్ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్ల భర్తీకి ఎస్వీయూ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. మార్చి 19తో దరఖాస్తు గడువు ముగియగా మార్చి 29 వరకు రూ.2వేలు, ఏప్రిల్ 6 వరకు రూ.5వేల అపరాధ రుసుంతో గడువు పొడిగించినట్లు కన్వీనర్ వెల్లడించారు. ఏప్రిల్ 10 నుంచి నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.