1. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. చెన్నై సూపర్కింగ్స్ కొత్త కెప్టెన్గా రుతురాజ్
రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్కింగ్స్ కొత్త కెప్టెన్గా నియమితుడయ్యాడు. ‘‘ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై జట్టులో అంతర్భాగం. ఈ కాలంలో అతడు 52 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం!
పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ (ఎంఎల్డీ) అనే అరుదైన వ్యాధికి లెన్మెల్డీ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర 4.25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.35 కోట్లు).
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్పర్సన్గా డాక్టర్ ఆర్.నందిని
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్పర్సన్గా డాక్టర్ ఆర్.నందిని బాధ్యతలు చేపట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆమె ఈ హోదాలో పనిచేస్తారు. చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె ఎండీగా ఉన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అరుణాచల్ ప్రదేశ్ భారత్దేనన్న అమెరికా
అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్దేనని, ఈ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.