• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 29-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)   

1.  భారత్‌-ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రుల సమావేశం

భారత్, ఉక్రెయిన్‌ మిత్ర దేశాలనీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు రెండు దేశాల మధ్యనున్న సహకార బంధాన్ని పునరుద్ధరించుకోవాలని నిశ్చయించాయని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఉద్ఘాటించారు. రెండురోజుల భారత పర్యటనకు వచ్చిన కులేబాతో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...






2.   ‘అబ్జర్వ్‌డ్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రోగ్రామ్‌’లో నాలుగు రాష్ట్రాలు!

అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) మనదేశంలో నిర్వహించే ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల్లో స్థానిక ఔషధ నియంత్రణ అధికార వర్గాలు పాలుపంచుకోనున్నాయి. ‘అబ్జర్వ్‌డ్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రోగ్రామ్‌’లో 4 రాష్ట్రాల ‘స్టేట్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీస్‌’కు భాగస్వామ్యం కల్పించాలని యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి 

హమాస్‌తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4.  ముంబయిలో ‘ఇండియా’ ఆందోళన

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమికి చెందిన పార్టీలు ముంబయిలో ఆందోళన నిర్వహించాయి. ఆయనను ఈడీ అరెస్టు చేయడం అన్యాయం అంటూ దక్షిణ ముంబయిలోని అజాద్‌ మైదానంలో సత్యాగ్రహం చేపట్టాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.