* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్ష నవంబర్ 4న ప్రధాన కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. అలాగే 9వ తరగతికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
జేఎన్వీ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
జేఎన్వీ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.