• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 03-04-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  అక్షయపాత్ర కృషి గర్వకారణం : మోదీ

ప్రముఖ స్వచ్ఛందసంస్థ ‘అక్షయపాత్ర ఫౌండేషన్‌’ 400వ కోట్ల భోజనాన్ని వడ్డించిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ‘ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్‌ విజయాలు’ అనే శీర్షికన దీన్ని నిర్వహించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

2.    33 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ (91) ప్రజా జీవితం నుంచి వైదొలిగారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టేలా చేసిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి ఆయన. పార్లమెంటు సభ్యుడిగా 33 ఏళ్ల పాటు కొనసాగిన మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

3.  10,000 మెగావాట్లకు అదానీ గ్రీన్‌ సామర్థ్యం

గుజరాత్‌లోని ఖావ్డా సౌర విద్యుత్‌ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రారంభించింది. తద్వారా భారత్‌లో 10,000 మెగావాట్లకు పైగా పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యమున్నతొలి కంపెనీగా అవతరించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  హైపర్‌సోనిక్‌ క్షిపణి వివరాలు వెల్లడించిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియా తాము పరీక్షించిన క్షిపణి వివరాలను వెల్లడించింది. ఘన ఇంధనంతో దూసుకెళ్లే మధ్యశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించామని తెలిపింది. ఈ పరీక్షను అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

5.  అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం ఎస్‌ఈగా విజయకుమార్‌

అంతర్రాష్ట్ర జల వనరుల విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా ఉన్న విజయకుమార్‌కు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 




6.  కివీస్‌ కెప్టెన్‌గా బ్రాస్‌వెల్‌ 

అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌తో తలపడే న్యూజిలాండ్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ మైకెల్‌ బ్రాస్‌వెల్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పాక్‌ ఆతిథ్యమిచ్చే ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 17న ఆరంభం కానుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



7.  అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం 

కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్సలెన్సీ(కేఐవైఈ) గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌-హైదరాబాద్‌ కార్యక్రమానికి ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.