* పరిశీలన.. తనిఖీలకు ఎన్ఎంసీ సిద్ధం
ఈనాడు, హైదరాబాద్: 2024-25 విద్యాసంవత్సరంలో ప్రారంభించేందుకు వీలుగా పది వైద్య కళాశాలలు తెలంగాణ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ప్రకటించింది. కొత్తగా ఎనిమిది ప్రభుత్వ, రెండు ప్రైవేటు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 112 వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఎన్ఎంసీ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా కొత్తగా ఏర్పాటు కానున్న ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలతో కలిపి ఆ సంఖ్య 34కు పెరగనున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉస్మానియా, గాంధీతోపాటు ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,915 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, నూతన కాలేజీల ఏర్పాటుతో ఆ సీట్ల సంఖ్య 4,315కు పెరగనుంది. దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ తనిఖీల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఎన్ఎంసీ తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.