ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్-2024)కి శనివారంతో దరఖాస్తు గడువు ముగిసింది. ఆలస్య రుసుంతో మే ఒకటో తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శనివారం వరకు మొత్తం 3,41,548 దరఖాస్తులు వచ్చాయని సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు 1,99,809 మంది, ఏపీ వారు 46,247.. మొత్తం 2,46,056 మంది దరఖాస్తు చేశారు. వ్యవసాయం, ఫార్మసీలో తెలంగాణ వారు 83,486 మంది, ఏపీ వారు 11,699.. మొత్తం 95,185 మంది; ఇంజినీరింగ్, ఫార్మసీ రెండింటికీ తెలంగాణ నుంచి 275 మంది, ఏపీ నుంచి 32.. మొత్తం 307 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అన్ని స్ట్రీమ్లకు కలిపి తెలంగాణ విద్యార్థులు 2,83,570 మంది, ఏపీ వారు 57,978.. మొత్తం 3,41,548 మంది దరఖాస్తు చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.