• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 06-04-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు) 

1.  విప్రో నూతన సీఈవోగా శ్రీనివాస్‌ పల్లియా

కంపెనీ సీఈఓ థియరీ డెలాపోర్ట్‌ రాజీనామా చేశారని ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది. ఆయన స్థానంలో శ్రీనివాస్‌ పల్లియాను నియమించినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 6న జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ, ఎండీగా శ్రీనివాస్‌ను నియమించాలన్న నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ సిఫారసుకు బోర్డు ఆమోదం తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



2.    అత్యధిక సెంచరీల జాబితాలో విరాట్‌ కోహ్లి

ఐపీఎల్‌లో కోహ్లి శతకాల సంఖ్య 8. అత్యధిక సెంచరీల జాబితాలో అతనిదే అగ్రస్థానం. బట్లర్‌ (6), గేల్‌ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడిన గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీకిది మూడో సెంచరీ కావడం విశేషం. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

3.  ఐఎస్‌ఎస్‌ నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. రష్యాకు చెందిన సోయజ్‌ ఎంఎస్‌-24 వ్యోమనౌక ద్వారా వారు కజకిస్థాన్‌లోని గడ్డినేలల్లోదిగారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  రాజ్యసభ సభ్యుడిగా జె.పి.నడ్డా ప్రమాణం

భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, మరో అయిదుగురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...





5.  భాజపా 44వ వ్యవస్థాపక దినోత్సవం

భారత ప్రజల ప్రాధాన్యం భాజపాయే అని, మరో విడత ప్రజలు తమనే ఎన్నుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. గత దశాబ్దకాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి దీనికి దోహదం చేస్తుందని తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.