1. శస్త్రచికిత్స మధ్యలో డ్రోన్ ద్వారా కణజాలం బట్వాడా
వైద్యరంగంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కర్ణాటకలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స మధ్యలో.. రోగి నుంచి సేకరించిన కణజాలాన్ని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేయించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిస్తే రూ.41.60 లక్షలు
ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో ఆర్థిక భారం!
ఛత్తీస్గఢ్ నుంచి రోజుకు వెయ్యి మెగావాట్ల ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందం’ (పీపీఏ) దస్త్రాల్లో లోపాలెన్నో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సీపీఎంకు 80 రహస్య బ్యాంకు ఖాతాలు
కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు త్రిశ్శూర్ జిల్లాలో 80 రహస్య (వెల్లడించని) బ్యాంకు ఖాతాలు, 100 కార్యాలయాలు (స్థిరాస్తులు) ఉన్నాయని ఎన్నికల సంఘానికి (ఈసీకి) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నివేదించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఐఐఎం-అహ్మదాబాద్కు ప్రపంచంలో 25వ ర్యాంకు
వ్యాపార, నిర్వహణ (బిజినెస్ అండ్ మేనేజ్మెంట్) విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐఎం-అహ్మదాబాద్ 25వ స్థానంలో నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.