CUET: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ 2024) తేదీలను ఏప్రిల్ 20న (శనివారం) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ పరీక్షలకు 13.4లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 63 సబ్జెక్టులకు ఏడు రోజుల్లో పరీక్షలను పూర్తి చేయనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన 15 సబ్జెక్టులకు పెన్ను, పేపరు విధానాన్ని అవలంభించనుండగా మరో 48 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించనున్నారు. పరీక్షలు మే 15న మొదలై 24న ముగియనున్నాయి. గత సంవత్సరం ఈ పరీక్షలను 34 రోజుల పాటు 93 షిప్టుల్లో నిర్వహించారు. రెండుసార్లు పరీక్షలు వాయిదా పడ్డాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.