దిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. ఈ రెండు పరీక్షలను ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని, స్కోర్ల నార్మలైజేషనుతో అవసరం ఉండదన్నారు. సాధారణీకరణ విధానం సమంజసంగా లేదని, పరీక్షల్లో తమ పనితీరుపై అది ప్రభావం చూపుతున్నట్లు విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒకే పేపరుకు రెండు మూడు రోజులు పరీక్ష నిర్వహించేవారమని, తద్వారా విద్యార్థులకు వీలైనంత వరకు మొదటి ఎంపిక కేంద్రం లభించేదన్నారు. ఈ ఏడాది నుంచి ఓఎంఆర్ విధానం అనుసరిస్తున్నందున విద్యాసంస్థల్లో పెద్దసంఖ్యలో కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, దేశవ్యాప్తంగా ఒకేరోజున పరీక్ష నిర్వహణకు ఇది అనుకూలంగా ఉంటుందని జగదీప్ కుమార్ చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.