* ఆలస్యరుసుంతో 30 వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఏప్రిల్ 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. రూ.100 ఆలస్యరుసుంతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్ష మే 26న నిర్వహిస్తామని వెల్లడించారు.