* అభ్యంతరాలకు గడువు మే 3
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్)-2024 ప్రిలిమినరీ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి సబ్జెక్టుల వారీగా ప్రిలిమినరీ కీ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 3వ తేదీలోగా కీపై ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలు తెలియజేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రధాన కేంద్రాల్లో పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తోంది.