* ఈ ఏడాది 38 లక్షల మంది విద్యార్థులు హాజరు
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు శుభవార్త. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే రెండో వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సీబీఎస్ఈ బోర్డు ఫలితాల వెల్లడి తేదీ, సమయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరుకాగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.