• facebook
  • whatsapp
  • telegram

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

* ఈ ఏడాది 38 లక్షల మంది విద్యార్థులు హాజరు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు శుభవార్త. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే రెండో వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాల వెల్లడి తేదీ, సమయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరుకాగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.


CBSE Website
 

Published Date : 01-05-2024 20:12:43

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం