• facebook
  • whatsapp
  • telegram

TSPSC: ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

* టీఎస్‌పీఎస్సీ ప్రకటన


హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్‌ విధానంలోనే పరీక్ష ఉంటుందని వెల్లడించింది. గ్రూప్‌-1 కోసం దాదాపు నాలుగు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల 19న నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Published Date : 01-05-2024 20:26:32

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం