• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET Hall Ticket: 7న ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

* మే 16 నుంచి పరీక్షలు ప్రారంభం

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌) హాల్‌టికెట్లు మే 7వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్‌ పరీక్షలు మే 18 నుంచి 23 వరకు జరుగనున్నాయి.


  AP EAPCET 2024 Website  

Published Date : 04-05-2024 20:23:25

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం