* మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024 హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టులను మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనుంది. టెట్ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులు.
Download TS TET 2024 Admitcard
TS TET Previous Question Papers