* మే 26న పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 26న నిర్వహిస్తారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి.