* కళాశాలల్లో రిపోర్టుకు చివరి తేది మే 30
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 28న నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఆదివారం (మే 19) విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు, కళాశాలలను కేటాయించామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు సంబంధిత కళాశాలల్లో మే 20 నుంచి 30వ తేదీలోగా రిపోర్టు చేయాలని సూచించారు. ఫలితాలను గురుకుల వెబ్సైట్లో తెలుసుకోవచ్చని
తెలిపారు.
బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి