• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 19-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. గోపీచంద్‌ తోటకూర దిగ్విజయంగా రోదసియాత్ర!

తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. ఐదో విడతలో 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు మే 20న ఓటింగ్‌ జరగనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. ఛాంప్స్‌ సాత్విక్‌-చిరాగ్‌!

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. అడవిలో కూలిన ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. వ్యాపార వృద్ధిలోబ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు అగ్రస్థానం

గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.