ఈనాడు, అమరావతి: ఓట్ల లెక్కింపు, 144 సెక్షన్ అమలు కారణంగా పాలిసెట్ కౌన్సెలింగ్లో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జూన్ 2 వరకు ఉన్న ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి మార్పూ లేదని, జూన్ 3న నిర్వహించాల్సిన దాన్ని ఆరో తేదీకి మార్పు చేశామని పేర్కొన్నారు. జూన్ 7 నుంచి 10 వరకు కళాశాలలు, కోర్సులకు వెబ్ ఐచ్ఛికాల నమోదు చేసుకోవచ్చని సూచించారు. జూన్ 11న ఐచ్ఛికాల మార్పునకు అవకాశం ఉంటుందని, 13న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ 14-19 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని, తరగతులు 14 నుంచే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
Polytechnic: పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు
Published Date : 29-05-2024 20:10:40
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.