* జూన్ 9న ర్యాంకులు వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 26న ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఎంత మంది పరీక్ష రాశారన్నది ఐఐటీ మద్రాస్ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనా. ఈసారి రెండు పేపర్లకు కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు. దీన్ని ఐఐటీలు నిర్ణయించి ఉంటాయని భావిస్తున్నారు. జూన్ 2న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి, 9న ర్యాంకులు వెల్లడించనున్నారు. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి.