1. భారత్ ఫుట్బాల్కు ఛెత్రి వీడ్కోలు!
భారత్ ఫుట్బాల్లో ఓ శకం ముగిసింది. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో కువైట్తో మ్యాచ్ తనకు ఆఖరిదని మేలోనే ప్రకటించిన భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. నలభైఆరు శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు!
లోక్సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 (46 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలినవారున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఐఎస్ఎస్కు చేరిన సునీత, విల్మోర్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. 18వ లోక్సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయసు 56: పీఆర్ఎస్
లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారి సగటు వయసు 56 ఏళ్లని పీఆర్ఎస్ సంస్థ వెల్లడించింది. గత లోక్సభలో ఇది 59గా ఉండేదని పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అంకురాల కోసం ఐఓబీ ప్రత్యేక శాఖ
ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది.