• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group 1: రేపు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

అరగంట ముందు గేట్ల మూసివేత


 


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 9 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది హాజరుకానున్న ప్రిలిమ్స్‌కు 895 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పిన కమిషన్‌... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని స్పష్టంచేసింది. అభ్యర్థులంతా హాల్‌టికెట్‌పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు ఫొటో అంటించాలని, హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులంతా బయోమెట్రిక్‌ తప్పనిసరి ఇవ్వాలని, బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమంది. గ్రూప్‌-1 పరీక్షలో  పాటించాల్సిన సూచనలపై ప్రతిరోజూ అభ్యర్థులకు కమిషన్‌ ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అప్రమత్తం చేస్తోంది. హాల్‌టికెట్, ప్రశ్నపత్రంపై ముద్రించిన సూచనలు తప్పనిసరి పాటించాలని తెలిపింది.



  TSPSC Group -1 Prelims Model papers  


  TSPSC Group-1 previous papers  

  TSPSC Group -1 prelims study material  


 

Published Date : 08-06-2024 11:37:33

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం