• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

* 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం
 



 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40వేల మంది ఉన్నారని అంచనా. పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ మద్రాస్‌ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ జూన్‌ 10 నుంచి జులై 23వ తేదీ వరకు 44 రోజులపాటు కొనసాగుతుంది. 

  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 

Updated Date : 09-06-2024 9:50:11

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం