• facebook
  • whatsapp
  • telegram

Pgecet: రేపటి నుంచి పీజీఈసెట్‌


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌(పీజీఈసెట్‌) నిర్వహించనున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది దరఖాస్తు చేశారు. వీరిలో ఓసీలు 3,346 మంది ఉన్నారు. అత్యధికంగా ఫార్మసీకి 7,376 మంది, కంప్యూటర్‌ సైన్స్‌-ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి 4,903 మంది దరఖాస్తు చేసుకున్నారు. 10 సబ్జెక్టులకు 100 మంది లోపు మాత్రమే పోటీ పడుతుండటం గమనార్హం. పోటీపడుతున్న మొత్తం అభ్యర్థుల్లో అమ్మాయిలు 12,532 మంది, అబ్బాయిలు 10,180 మంది ఉన్నారు. పరీక్ష మధ్యలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకురావాలని, మరో కంప్యూటర్‌పై పరీక్ష రాసే అవకాశముంటుందని, నష్టపోయిన సమయాన్ని కూడా పొందవచ్చని కన్వీనర్‌ ఆచార్య ఎ.అరుణ కుమారి తెలిపారు.

Published Date : 09-06-2024 9:36:26

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం