* సాయంత్రం 3:30 గంటలకు విడుదల
ప్రతిభ డెస్క్: తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు ఈరోజు (జూన్ 11న) సాయంత్రం 3:30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రాష్ట్రంలోని పలు కాలేజీల్లోని రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు జరిపిన టీజీ ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ ఆచార్య మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 23వ తేదీన జరిగిన ఎడ్సెట్కు మొత్తం 29,463 మంది హాజరయ్యారు. ఎడ్సెట్ పరీక్షలు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.