• facebook
  • whatsapp
  • telegram

ICET: నేటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ 

* ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభం
 


ఈనాడు, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 26 నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. రిజిస్ట్రేషన్లు 26 నుంచి ఆగస్టు 1 వరకు, ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి ఆగస్టు 3 వరకు ఉంటుందని, ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 2న నిర్వహించనున్నామని వెల్లడించారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 4 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు. ఐచ్ఛికాల మార్పు ఆగస్టు 8న, సీట్ల కేటాయింపు 10న చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదే నెల 12 నుంచి 16 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. తరగతులు 12 నుంచి ప్రారంభమవుతాయి.


  AP ICET MOCK COUNSELLING  
 

Updated Date : 26-07-2024 11:50:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం