* ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభం
ఈనాడు, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. రిజిస్ట్రేషన్లు 26 నుంచి ఆగస్టు 1 వరకు, ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి ఆగస్టు 3 వరకు ఉంటుందని, ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 2న నిర్వహించనున్నామని వెల్లడించారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 4 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు. ఐచ్ఛికాల మార్పు ఆగస్టు 8న, సీట్ల కేటాయింపు 10న చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదే నెల 12 నుంచి 16 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. తరగతులు 12 నుంచి ప్రారంభమవుతాయి.