విజయవాడ సబ్కలెక్టరేట్, న్యూస్టుడే : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర సైన్సు విద్యార్థులకు మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నట్టు కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలోని విడిది కార్యాలయంలో పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని మార్చి 24న నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ.. ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రయోగ పరీక్షలకు 47,315 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో 47, గ్రామీణ ప్రాంతాల్లో 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జబ్లింగు విధానంలో పరీక్షలు ఉంటాయన్నారు. వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఇంటర్ థియరీ మొదటి సంవత్సర పరీక్షలు మే 5 నుంచి, ద్వితీయ సంవత్సర పరీక్షలు మే 4 నుంచి నిర్వహించనున్నట్టు వివరించారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, ఇన్ఛార్జి డీఈవో చంద్రకళ, వీఎంసీ అదనపు కమిషనరు మోహనరావు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.