• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ-ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్టియ‌ర్‌‌ ప్రమోష‌న్‌

సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా


ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే రెండో ఏడాదికి ప్రమోట్‌ చేస్తారు. రెండో ఏడాది పరీక్షలను వాయిదావేశారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఏప్రిల్ 15న‌ ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తదితరులతో సమావేశంలో చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

 ఇంటర్‌ తొలి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షల తేదీని ప్రకటించి వాటిని నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
 ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని వాయిదావేశారు. జూన్‌ మొదటి వారంలో సమీక్షించి, పరీక్షల ప్రారంభానికి 15 రోజుల ముందుగా తేదీలు ప్రకటిస్తారు.
 ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు బ్యాక్‌లాగ్‌లు (ప్రథమ సంవత్సరంలో తప్పినవి) ఉంటే వాటికి కనీస మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తారు. ఇలాంటి వారు 1,99,019 మంది ఉన్నారు.

‣ ప్రమోట్‌ అంటే ఏమిటో?

ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ తాజా ప్రకటనలో స్పష్టత లోపించింది. పరీక్షలు లేకుండానే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు పెడతామని తెలిపింది. మామూలుగా అయితే మొదటి సంవత్సరం విద్యార్థులు.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైనా లేక అసలు పరీక్షలకు హాజరు కాకపోయినా ద్వితీయ సంవత్సరం చదవడానికి ఆటంకం ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో గందరగోళం నెలకొంది.

‣ ప్రయోగ పరీక్షలు కూడా వాయిదా?

ప్రయోగ పరీక్షలను మే 29వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇటీవల ఇంటర్‌బోర్డు ప్రకటించింది. తాజాగా రెండో ఏడాది వార్షిక పరీక్షలను వాయిదా వేయడంతో మే 29 నుంచి అయినా జరుగుతాయా అన్నది అనుమానమే. దీనిపై ఇంటర్‌బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.