ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా జూనియర్కళాశాలల పనిదినాలు తగ్గడంతో సిలబస్ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షల్లో 70 శాతం సిలబస్నుంచే ప్రశ్నలు వస్తాయని, తొలగించిన 30 శాతాన్ని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, ఖాళీ పీరియడ్స్లో బోధించాలని సూచించారు. గతేడాది 2020 - 21లోనూ 30శాతం సిలబస్ను తగ్గించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
పాఠశాల విద్యలోనూ తగ్గింపు..
పాఠశాల విద్యలో ఇప్పటికే సబ్జెక్టుల వారీగా రెండేసి అధ్యాయాలు (ఛాప్టర్స్) తగ్గించారు. ఈ మేరకు అకడమిక్కేలండర్ను విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా తగ్గించిన సిలబస్వివరాలను ఉపాధ్యాయులకు అందించారు.
మరింత సమాచారం... మీ కోసం!
పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.