‣ ఐఐటీల్లో సీట్లు రానివారు 62.82%
ఈనాడు, దిల్లీ: తాజాగా జరిగిన ‘జేఈఈ అడ్వాన్స్డ్-2020’కి 1,50,838 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 43,204 (28.64%) మందే అర్హత సాధించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. అందరికంటే ఎక్కువగా జనరల్ కేటగిరీ విద్యార్థులు అర్హత సాధించారని, తర్వాతి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు. అర్హత సాధించిన వారిలో 27,143 (62.82%) మందికి ఐఐటీ సీట్లు రాలేదని పేర్కొన్నారు.