* మే నెలలో పునశ్చరణ తరగతులు
* 35-40 శాతం పాఠ్యాంశాల తగ్గింపు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ చివరి నాటికి పాఠాలను పూర్తి చేసి.. మే నుంచి పునశ్చరణ తరగతులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో పూర్తి స్థాయి తరగతులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రైవేటు బడులు ఏప్రిల్ నుంచే పునశ్చరణకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో మార్చి మూడో వారం నుంచి అదనపు తరగతులు నిర్వహించేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలను రూపొందించారు. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పదో తరగతి పాఠ్యాంశాలను 35-40 శాతం కుదిస్తూ వార్షిక ప్రణాళికను విడుదల చేసింది. వార్షిక ప్రణాళికలోని అధ్యాయాలు, పాఠ్యాంశాలను మూడు కేటగిరీలుగా విభజించింది. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునేవి, ఇంటి వద్ద చదువుకునేవి, ఐచ్ఛికంగా నేర్చుకునేవిగా గుర్తించింది. ఇందులో ఐచ్ఛికంగా నేర్చుకునేవి పరీక్షల్లో ఇవ్వరు. మొదటి రెండు విభాగాల్లో నేర్చుకునే అంశాలనే పబ్లిక్ పరీక్షలకు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యార్థులకు 7 పరీక్షలను నిర్వహించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.