‣ జూన్ 7 నుంచి పబ్లిక్ పరీక్షలు
ఈనాడు, అమరావతి: పదో తరగతి విద్యార్థులకు మే నెల 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 30లోపు పాఠ్య ప్రణాళికను పూర్తి చేయాలని సూచించింది. మే ఒకటి నుంచి మే 16వరకు ప్రీఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పేర్కొంది. మే 25 నుంచి జూన్ 6వరకు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించింది. జూన్ 7నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.