• facebook
  • whatsapp
  • telegram

Model Schools: ‘ఆదర్శ’ సీట్లకు 73,201 మంది దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 194 ఆదర్శ (మోడల్‌) పాఠశాలల్లోని 6-10 తరగతుల సీట్ల కోసం మొత్తం 73,201 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు తుది గడువు మార్చి 15తో ముగిసింది. ఆరో తరగతిలో ప్రవేశానికి 39,505 మంది పోటీ పడుతుండగా.. మిగిలిన తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు 13,823 మంది, 8వ తరగతికి 11,599, 9వ తరగతికి 6,288, పదో తరగతిలోని ఖాళీ సీట్ల కోసం 1,986 మంది దరఖాస్తులు సమర్పించారు. ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Published Date : 19-03-2022 11:39:21

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం