* అధికారులకు సీఎం జగన్ సూచన
ఈనాడు, అమరావతి: అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) పరీక్షలపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించినట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో సీఎం జూన్ 25న సమీక్షించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. పరీక్షలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి? ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? రద్దు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? లాంటి పూర్తి వివరాలతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యామండలి మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి, రెండు, మూడు రోజుల్లో నివేదిక రూపొందించనుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.