ఈనాడు, అమరావతి: జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష(ఎన్టీఎస్ఈ)కు పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి సూచించారు. దూరవిద్య విధానంలో మొదటిసారి పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా అర్హులేనని తెలిపారు. పరీక్ష రుసుము కింద రూ.200 ఏపీసీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, నవంబరు 9 లోపు పరీక్ష రుసుము చెల్లించాలని సూచించారు. డిసెంబరు 13న పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలు వెబ్సైట్ http://www.bseap.org/ లో పొందుపర్చినట్లు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.