జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్టుడే: రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్, అనుబంధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆర్జీయూకేటీ సెట్- 2020ను నవంబరు 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.త్రిమూర్తులు తెలిపారు. ఆర్జీయూకేటీ సెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరైన వారికి ట్రిపుల్ ఐటీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారని వివరించారు. నవంబరు 28 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.1000 అపరాధరుసుంతో నవంబరు 15 వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తులను http://www.rgukt.in/ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.