* ఆంగ్రూ రిజిస్ట్రార్ త్రిమూర్తులు స్పష్టీకరణ
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు యూజీసీ, ఐసీఏఆర్, ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ విద్యలో (బీఎస్సీ ఏజీ) డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చేస్తున్న ప్రకటనలను విద్యార్థులు నమ్మవద్దని, అవి జారీ చేసే వ్యవసాయ డిగ్రీలు చెల్లవని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్.త్రిమూర్తులు స్పష్టం చేశారు. నవంబరు 6న ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల వివరాలను తెలిపారు. బాపట్ల, తిరుపతి, వైరా, మహానంది, రాజమహేంద్రవరంలలో ఆంగ్రూ కళాశాలలు, అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల, ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలోని కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల, మార్కాపురంలోని ఎన్.ఎన్.వ్యవసాయ కళాశాల, కడప జిల్లా బద్వేల్లోని ఎస్బీవీఆర్ వ్యవసాయ కళాశాల, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల, తాడిపత్రిలోని జె.సి.దివాకర్రెడ్డి వ్యవసాయ కళాశాలలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉన్నాయన్నారు. కళాశాలల వెబ్సైట్ను చూడాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.