జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో ట్రైనీ ఇంజినీర్లు, ఆపరేటర్స్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా అధికారి షేక్ బాజీబాబు తెలిపారు. పురుష అభ్యర్థుల వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఆయా పోస్టులకు బి.టెక్, డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్), ఐటీఐ (వెల్డర్స్, ఫిట్టర్స్, టర్నర్స్, అదర్స్), డిగ్రీ, ఇంటర్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నవంబరు 25 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.apssdc.in వెబ్సైట్ని చూడాలన్నారు. టోల్ఫ్రీ నంబరు 1800 425 2422లో సంప్రదించాలని కోరారు.
ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published Date : 24-11-2020 10:47:55
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.