జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో ట్రైనీ ఇంజినీర్లు, ఆపరేటర్స్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా అధికారి షేక్ బాజీబాబు తెలిపారు. పురుష అభ్యర్థుల వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఆయా పోస్టులకు బి.టెక్, డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్), ఐటీఐ (వెల్డర్స్, ఫిట్టర్స్, టర్నర్స్, అదర్స్), డిగ్రీ, ఇంటర్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నవంబరు 25 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.apssdc.in వెబ్సైట్ని చూడాలన్నారు. టోల్ఫ్రీ నంబరు 1800 425 2422లో సంప్రదించాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.