• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకుగాను డిసెంబ‌రు 6 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని.. 8 నుంచి 12 వరకు పరిశీలన ఉంటుందని తెలిపింది. 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పస్టం చేసింది. అలాగే డిసెంబ‌రు 22నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపింది. 22న స్లాట్‌ బుకింగ్‌, 23న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు వివరించింది. 26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు అనంతరం 28న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు విద్యామండలి వివరించింది.

Published Date : 02-12-2020 20:16:35

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం