ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు 30 వేల మందికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఐబీఎం ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి ఐబీఎం పనిచేయనుంది. ఈ ఉచిత ఓపెన్ పి-టెక్ కోర్సులో భాగంగా సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్, కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యాసం (మెషిన్ లెర్నింగ్), క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లాంటి సాంకేతికతలతో పాటు, వృత్తి నైపుణ్యాలలోనూ శిక్షణ అందిస్తుంది. కాలేజీ అధ్యాపకులకూ ఈ డిజిటల్ ప్లాట్ఫాం వినియోగంలో శిక్షణ ఇవ్వనుంది. దీనివల్ల వారు తమ విద్యార్థులకు సాయం చేయగలుగుతారు. ఉపాధికి తోడ్పడే సాంకేతికతపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నదే ధ్యేయమని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.