ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు 30 వేల మందికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఐబీఎం ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి ఐబీఎం పనిచేయనుంది. ఈ ఉచిత ఓపెన్ పి-టెక్ కోర్సులో భాగంగా సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్, కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యాసం (మెషిన్ లెర్నింగ్), క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లాంటి సాంకేతికతలతో పాటు, వృత్తి నైపుణ్యాలలోనూ శిక్షణ అందిస్తుంది. కాలేజీ అధ్యాపకులకూ ఈ డిజిటల్ ప్లాట్ఫాం వినియోగంలో శిక్షణ ఇవ్వనుంది. దీనివల్ల వారు తమ విద్యార్థులకు సాయం చేయగలుగుతారు. ఉపాధికి తోడ్పడే సాంకేతికతపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నదే ధ్యేయమని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఐబీఎం ఒప్పందం
Published Date : 15-12-2020 11:44:28
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.